logo

జగిత్యాల "ఎల్ఐసీ" లో ఎగిరిన "ఎవోఐ" జెండా ఘనంగా ప్రపంచ కార్మికుల దినోత్సవ వేడుకలు

జగిత్యాల "ఎల్ఐసీ" లో ఎగిరిన "ఎవోఐ" జెండా

ఘనంగా ప్రపంచ కార్మికుల దినోత్సవ వేడుకలు

జగిత్యాల:

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎల్ఐసి కార్యాలయ ఆవరణలో బుధవారం ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మేడే సందర్భంగా జెండా కార్యక్రమం నిర్వహించారు. ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ వేడుకలను ఎల్ఐసి ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసి ఎవోఐ) జగిత్యాల శాఖ అధ్యక్షులు ఆమందు రాజ్ కుమార్ అధ్యక్షతన ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు, ఏజెంట్లకు మే డే శుభాకాంక్షలు తెలియజేశారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న మే డే ఉత్సవాలు కార్మికులకు, కర్శకులకు ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాయని పేర్కొన్నారు. జగిత్యాలలో మొట్ట మొదటి సారిగా ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మే డే ఉత్సవాలు జరుపడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఎఓఐ ప్రధాన కార్యదర్శి రేగొండ లక్ష్మి కాంతం, కోశాధికారి మహంకాళి ప్రభాకర్, చీఫ్ అడ్వైజర్ ఏనుగు గంగారెడ్డి ల ఆధ్వర్యంలో ఏజెంట్స్ అందరూ కార్మికులకు, శ్రేయోభిలాషులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఆల్ ఇండియా మీడియా అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, క్లియా డివో అక్కినపెళ్లి చంద్ర శేఖర్, ఉద్యోగ సంఘ నాయకులు రాం ప్రసాద్, రిటైర్డ్ ఎంఈవో జల్ద అశోక్ తదితరులు కార్మికుల దినోత్సవం గురించి ప్రసంగించారు.
ఎవోఐ నాయకులు రౌతు నర్సయ్య, టి.రాజారెడ్డి, జి.రాజేశం, పుల్కం జలపతి, ఆనంద్ రెడ్డి, పుల్లూరి ఆంజనేయులు, తాటికొండ వినయ్, నల్ల మనోహర్, రవి, సతీష్, సిబ్బంది రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

0
121 views